🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 23 Jul, 2026 | Page: 1

పీఎం మోదీ ట్వీట్‌కు సీజేపీ కౌంటర్‌..

నీట్‌ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేపర్‌ లీకేజీ బాధ్యులపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని గురువారం ఉదయం ప్రధాని మోదీ ఎక్స్(PM Mod Tweet) వేదికగా తెలిపారు. అయితే ప్రధాని మోదీ ట్వీట్‌పై లోకసభ విపక్ష నేత, సీజేపీ గట్టి కౌంటర్‌ ఇచ్చాయి. విద్యార్థుల జీవితాలను దెబ్బ తీసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌పై రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు.
🏠 Home