🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 28 Jul, 2026 | Page: 1

డీఎస్సీపై బహిరంగ చర్చకు రండి..

వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డీఎస్పీపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే స్వీకరించాలన్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని జగన్, వైసీపీకి ఛాలెంజ్ చేశారు. జగన్, ఆయన టీంకు బుద్ధి లేదని.. ప్రజలకు మంచి చేస్తున్నా కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ విద్యాశాఖ మంత్రి అయ్యాకే.. విద్యారంగంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని.. పెనుమార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

🏠 Home