భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తన కుమార్తె ఆశ్రితతో కలిసి శనివారం హనుమకొండలోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.