స్వదేశానికి సురేశ్ పట్నాల మృతదేహం..
ఒమన్ తీరంలో డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో పట్నాల సురేశ్ మృతదేహాన్ని హైదరాబాద్ మీదుగా విశాఖలోని శ్రీహరిపురంలో గల ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సురేశ్కు భార్య భార్గవి.. 13, 10 ఏళ్ల కుమారులు ఉన్నారు. సురేష్ను కడసారి చూసి, నివాళులర్పించేందుకు స్థానికులు, బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.