🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న గవర్నమెంట్ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న గవర్నమెంట్ టీచర్‌పై వేటుపడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో గిరిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, మోసాలకు పాల్పడుతున్నాడని ఇటీవల కలువల ఎల్లయ్యపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ కోసం కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జరిపిన ప్రాథమిక విచారణలో నేరం రుజువు కావడంతో డీఈవో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
🏠 Home