ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్
ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య ఇవాళ మూడో వన్డేజరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన గిల్ సేన.. వన్డే సిరీస్ను చేజిక్కించుకన్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. ప్రసిద్ధ కృష్ణ, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను జట్టులోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నాలుగు మార్పులు చేశారు. ఫైనల్ వన్డేలోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తున్నది.