🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 24 Jun, 2026 | Page: 1

పేద‌ల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు పోతుంది : సీఎం రేవంత్​ రెడ్డి

ఎస్​ఐఆర్ (ఓటరు జాబితా సవరణ ప్రత్యేక సవరణ కార్యక్రమం)​​ ప్రక్రియ చాలా సీరియస్​ అంశమని, అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ విషయంలో సరిగా వ్యవహరించకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని, వారి ఓట్లు పోతే ఆధార్, రేషన్​ కార్డు పోతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్​ఐఆర్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నిర్వహించిన జూమ్​ మీటింగ్​లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించే ప్రసక్తే లేదు : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్​ఆర్​ఐపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది నాయకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్​ఐఆర్​ అవగాహన సదస్సుల రిపోర్ట్ తన దగ్గర ఉందన్న సీఎం, పార్టీ తరఫున ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశంపై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలన్నారు. ఎస్​ఐఆర్​పై మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో పార్టీ ఆదేశాలను పట్టించుకోని వారి స్థానంలో మరొక ఇన్​ఛార్జిని నియమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పనిచేయని వారికి 10 రోజులు సమయం ఇచ్చి చూస్తామని, లేకుంటే వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్​ఐఆర్​పై పార్టీ సర్పంచ్​లతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
🏠 Home