వల్లపు గంగయ్యకు మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ స‌న్మానం

జాజిరెడ్డిగూడెం మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన లోయపల్లి గ్రామ సర్పంచ్ వల్లపు గంగయ్యను గురువారం అర్వపల్లిలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు కిశోర్ కుమార్‌ను గజమాలతో సత్కరించారు. అనంతరం కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సూరారపు అజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.