సాగర్ నీటితో చెరువులు నింపాలి
సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంగా స్వరాష్ట్ర సాధన జరిగిందని, సొంత రాష్ట్రంలో కూడా జిల్లాకు మొండి చేయి చూపి పాలేరుకు జలాలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ దంపతులకు రైతుల గోస కనిపించడం లేదన్నారు. గతంలో కూడా జిల్లాలోని కాల్వ తూములను సీజ్ చేసి ఖమ్మం జిల్లాలకు నీటిని తరలించుకుపోయారని, తర్వాత వరద నీటితో తూముల్లో నీరు పారక కాల్వలకు గండ్లు,...