అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాలి..
పార్లమెంట్(Parliament)లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్సభలో ఇవాళ కూడా విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టారు. సీజేపీ కార్యకర్తులు, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరుతూ విపక్షాలు డిమాండ్ చేశాయి. సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కానీ విపక్ష సభ్యులు షా స్టేట్మెంట్ కోసం పట్టుపట్టారు. విపక్ష సభ్యులు ఎంతకీ తగ్గకపోవడంతో.. స్పీకర్ బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. అయితే యాంటీ పేపర్ లీకేజీ బిల్లుపై మంగళవారం చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే.