పెరిగిన పత్తి, మక్కల ధరలు

వరంగల్‌ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తికి క్వింటాకు రూ.9350లు పలుకగా మక్కలకు క్వింటాకు రూ.2550లు పలికింది. గత కొద్దిరోజులుగా పత్తికి ధరలు పెరుగుతూ వచ్చాయి. గత బుధవారం పత్తి ధర క్వింటాకు రూ.9400లు పలికింది. ధరలు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రైతులు ఇప్పటివరకు తమ వద్ద ఉన్న పత్తి, మక్కలను 99 శాతం అమ్ముకున్నారు. రైతులు తమ పంటలను అమ్ముకున్న తరువాత ధరలు పెరుగుతున్నాయని.. అదే రెండు నెలల ముందు పెరిగి ఉంటే బాగుండేదని రైతులు వాపోతున్నారు.