దంపతులపై శునకం దాడి..

పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్‌బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.