భారత్-రష్యా మధ్య భారీ రక్షణ ఒప్పందం?
భారత వైమానిక రక్షణను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో ఐదు S-400 'సుదర్శన్' ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యా ప్రతిపాదన పంపింది. సుమారు రూ.50 వేల కోట్లకు పైగా విలువైన ఈ డీల్ను కేంద్ర రక్షణ శాఖ పరిశీలిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే మూడేళ్లలో కొత్త వ్యవస్థల డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.