వరంగల్లో మోగిన బడిగంట – సందడిగా ప్రారంభమైన కొత్త విద్యా సంవత్సరం
వరంగల్, జూన్ 15 (సుదీక్ష న్యూస్): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో వరంగల్ జిల్లాలో విద్యార్థుల సందడి నెలకొంది. ఆదివారం ఉదయం బడిగంట మోగగానే చిన్నారులు ఆనందోత్సాహాలతో పాఠశాలలకు చేరుకున్నారు. కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాల ఆవరణలోకి అడుగుపెట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఉదయం ప్రార్థన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కొత్త విద్యా సంవత్సరంలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ, పరిశుభ్రత పాటించాలంటూ ఉపాధ్యాయులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు....