శ్రీకాకుళం జిల్లాలో రైలుకింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన పలా-కాశిబుగ్గ మున్సిపాలిటీలో జరిగింది. రైలు పట్టాల వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.