పేద‌ల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు పోతుంది : సీఎం రేవంత్​ రెడ్డి

ఎస్​ఐఆర్ (ఓటరు జాబితా సవరణ ప్రత్యేక సవరణ కార్యక్రమం)​​ ప్రక్రియ చాలా సీరియస్​ అంశమని, అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ విషయంలో సరిగా వ్యవహరించకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని, వారి ఓట్లు పోతే ఆధార్, రేషన్​ కార్డు పోతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్​ఐఆర్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నిర్వహించిన జూమ్​ మీటింగ్​లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించే ప్రసక్తే లేదు :...