రైళ్ల‌లో 1.27 కోట్ల ట‌వ‌ల్‌లు, దుప్ప‌ట్లు చోరీ..

భారతీయ రైల్వే (Indian Railways) లోని రైళ్ల‌ ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్ సామగ్రి భారీ స్థాయిలో చోరీకి గురవుతోంది. కొవిడ్ అనంతరం 2022 జనవరి నుంచి 2026 మే వరకు నాలుగేళ్ల‌లో దేశవ్యాప్తంగా టవళ్లు (Towels), దిండ్లు, దుప్పట్లు (Bedsheets) వంటి కనీసం 1.27 కోట్ల వస్తువులు మాయమైనట్లు ఆర్‌టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు 69 రైల్వే డివిజన్లలో 54 డివిజన్లు స్పందించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రజా ఆస్తులపట్ల నిర్లక్ష్య ధోరణిని ఇది ప్రతిబింబిస్తోందని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆర్‌టీఐ వివరాల ప్రకారం.. గ‌డిచిన‌ నాలుగేళ్లలో ట‌వ‌ల్‌లు, దిండ్లు, దుప్ప‌ట్ల వంటి...