సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(శనివారం) గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుడివాడలో వేదికలను అధికారులు ఖరారు చేశారు. ఈరోజు(శుక్రవారం) బైపాస్ రోడ్డు, ఇంజినీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలలో సీఎంఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లను ఖరారు చేశారు. కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏర్పాట్లను పరిశీలించారు. బైపాస్ రోడ్డులో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశ వేదికను సిద్ధం చేయనున్నారు.