Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రూ.500 కోట్లతో ఆసుపత్రి కట్టారు - సేవలు మాత్రం అందట్లేదు : ఇక అంతా సర్కారు దయ!

Author Neti Sudiksha | 21 Jul 2026, 12:56 PM | పెద్దపల్లి
రూ.500 కోట్లతో ఆసుపత్రి కట్టారు - సేవలు మాత్రం అందట్లేదు : ఇక అంతా సర్కారు దయ!

ఇప్పుడున్న ఆసుపత్రి, వైద్య సౌకర్యాలు అక్కడి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలంటే ఇప్పటికే దాదాపుగా నిర్మాణం పూర్తైన ఆసుపత్రి భవనం వినియోగంలోకి రావాలి. రోగులకు సకల సౌకర్యాలు అందించాలంటే ఇంకా రూ.100 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సింగరేణి ఇచ్చినవే. మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే అందుబాటులోకి రానున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 355 పడకల ప్రభుత్వాసుపత్రిపై 'ఈటీవీ-ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనం.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ సార్వజనీయ ఆసుపత్రి నిర్మాణంలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోంది. సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం అక్కడ ప్రభుత్వాసుపత్రి సహా బోధన కళాశాల నిర్మాణానికి రూ.510 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అక్కడ మెడికల్ కాలేజీతో పాటు 355 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. వైద్య కళాశాల నిర్మాణం పూర్తైనా, ప్రస్తుతం ఇచ్చిన నిధులు అయిపోవడంతో హాస్పిటల్ భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. మంచినీటి, మురుగు నీటి వ్యవస్థ, పెయింటింగ్, ఇతర మౌలిక వసతులకు సంబంధించి దాదాపు రూ.45 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి.